ఆంధ్రాలో కాంగ్రెస్ పని దాదాపు ఖతమైంది. గత ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవకుండా అయిపోయింది దాని పరిస్థితి. అలాగని కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఎన్నోసార్లు ఇలాంటి కష్టాల నుంచి ఆ పార్టీ గట్టెక్కింది. 

అందుకే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఏపీకి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందన్నది ఏపీ జనం అభిప్రాయం. ఇందులో రెండో అభిప్రాయంలేదు. రాష్ట్రవిభజన సమయంలో తమ వాదన ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఆ కోపనే.. గత ఎన్నికల్లో ప్రతిబింబించింది. 

ఐతే.. ఎంత కోపమైనా కొన్నాళ్లకు తగ్గుతుంది కదా.. అలా తగ్గకుండా ఏపీలో కాంగ్రెస్ ఎప్పుడూ జీరో స్థాయిలో ఉండాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. విభజన ద్రోహం పదే పదే గుర్తుకు వచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు జూన్ 2 నవ నిర్మాణ దీక్ష కూడా అందులో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: