రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉంటేనే పద్దతిగా ఉంటుంది. సంస్కారమనే గీత దాటిన విమర్శలు రాజకీయాలంటే జనంలో ఉన్న చులకన భావనను మరింత పెంచుతాయి. ఇక పదవుల్లో ఉన్నవారు ఈ విషయాన్ని మరింతగా గుర్తుపెట్టుకోవాలి. 

అవేం ముద్దులంటున్న టీడీపీ..


విశాఖలో జరిగిన మినీ మహానాడులో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ విషయం మరిచిపోయారు. ప్రతిపక్షనేత జగన్ పై స్థాయి దిగజారి మరీ విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంటే.. జగన్ మాత్రం భరోసా యాత్ర పేరుతో అమ్మాయిలకు ముద్దులు పెడుతున్నాడని ఘాటుగా కామెంట్ చేశారు. 

ముందే అది పార్టీ మినీమహానాడు.. జగన్ ను ఎంతగా తిడితే అంతగా ఫోకస్ కావచ్చనుకున్నారో ఏమో అయ్యన్న అక్కడితో ఆగలేదు. జగన్ అమ్మాయిల బుగ్గులు పిండుతున్నారని.. ముద్దులు పెడుతున్నారని కామెంట్ చేశారు. అందుకే రోడ్డుపై జగన్ కనిపిస్తే చాలు.. అమ్మాయిలు పారిపోతున్నారని అయ్యన్న కామెంట్ చేశారు. అయ్యన్న విమర్శలతో పార్టీ నేతలు ఘొల్లున నవ్వారు. టీవీల ముందు చూసిన వాళ్లు మాత్రం మరీ ఇంత చీప్ విమర్శలా అనుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: