వెసవి కాలం సెలవుల్లో సరదాగా గడపాల్సిన ఆ పిల్లలు అర్ధాంతరంగా మృత్యువాత పడ్డారు. వేసవి తాపానికి నీటి లో హాయిగా ఆడుకుందాం అని వెళ్లి అనంత లోకాలకు వెళ్లారు. వివరాల్లోకి వెళితే...కరీంనగర్ లోయర్ మానేరు డామ్ వద్ద ఈతకు వెళ్లిన విద్యార్ధులు ఆరుగురు గల్లంతయ్యారు, మరొకరి గురించి గాలింపులు జరుపుతున్నారు. సరదాగా ఈత కోసం వెళ్లారు, నీట మునిగి పోయారు, వీరంతా 14 ఏళ్ల లోపు పిల్లలు, కన్నీరు మున్నీరు అవుతున్న పిల్లల తల్లిదండ్రులు.


మానేరు డ్యాం వద్ద ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు


కరీంనగర్ లోయర్ మానేరు డామ్ వద్ద ఈతకు వెళ్లిన విద్యార్ధులు ఆరుగురు గల్లంతయ్యారు.వారిలో ఐదుగురి శవాలను బయటకు తీశారు.మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ చిన్నారు అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు పడే బాధను చూస్తుంటే అక్కడున్న వారికి కంట తడి ఆగలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: