ఏపీలో చంద్రబాబు పాలనకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షపార్టీలు విమర్శల జోరు పెంచుతున్నాయి. టీడీపీ మినీమహానాడు, ఏడాది సంబరాల్లో ఉంటే.. ప్రధానప్రతిపక్షం ఏడాది లోపాలపై చాకిరేవు పెట్టే పనిలో బిజీగా ఉంది. గుంటూరులో జగన్ తలపెడుతున్న సమరదీక్షను  విజయవంతం చేసేందుకు జోరుగా ప్రయత్నిస్తోంది. 

అబద్దాల్లో బాబు నెంబర్ వన్..


జగన్ సన్నిహితుడు, ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి ఈ సమరదీక్ష పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్శంగా ఆయన చంద్రబాబు పాలనపై ఆసక్తికరమైన సెటైర్లు వేశారు. స్వతహాగా రాజకీయ నాయకుడు కాకపోయినా.. చంద్రబాబు పాలనపై బాగానే విమర్శలు గుప్పించారు. 

అబద్ధాలు చెప్పటంలో ప్రపంచవ్యాప్తంగా పోటీలు పెడితే చంద్రబాబు నాయుడుకే ఫస్ట్ ప్లేస్ దక్కుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు. అంతే కాదు. అబద్దాల విషయంలో చంద్రబాబు ఏకంగా గిన్నిస్ రికార్డు నెలకొలుపుతారని విజయసాయి ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే జగన్ సమర దీక్ష నిర్వహిస్తున్నట్టు విజయసాయి చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: