టీడీపీలో ఎదుటి పార్టీలపై విరుచుకుపడేందుకు కొందరు స్పెషలిస్టులున్నారు. అలాంటి వారిలో ముందువరుసులో ఉంటారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.  దురదృష్టం వెంటాడి పాపం.. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ.. లేకపోతే.. బాబు కేబినెట్ లో కీలక మంత్రి పదవి దక్కి ఉండేది. 

మళ్లీ ఫాంలోకి వచ్చిన సోమిరెడ్డి..

 
కీలకమైన నాయకుడు కాబట్టే చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీ సీటు ఇప్పించడం ద్వారా.. మళ్లీ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ సోమిరెడ్డికి ఛాన్సు దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి.. ఈ పరిణామాలన్నీ సోమిరెడ్డిలో జోష్ పెంచాయో ఏమో.. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. 

రఘువీరా, బొత్సలపై సోమిరెడ్డి ఫైర్..


ఈమధ్య చంద్రబాబుపై ఆరోపణల వర్షం కురిపిస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా, మాజీ చీఫ్ బొత్సలపై సోమిరెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. రఘువీరా, బొత్స గతంలో జగన్ వద్ద బానిసలుగా బతికారని తీవ్రవ్యాఖ్యాలు చేసారు. ఇప్పుడు కూడా రఘువీరా, బొత్స ఇద్దరూ జగన్ రూట్లోనే వెళ్తున్నారని మండిపడ్డారు.

అక్కడితో ఆగకుండా.. బొత్స, రఘువీరాలకు కళ్లు మూసుకుపోయాయని, అందుకే సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి వారికి కనిపించడంలేదని అంటున్నారు. పార్టీల మధ్య విమర్శలు మామూలేకానీ.. మరీ బానిసలనే రేంజ్ లో తిట్టడం బాగాలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: