హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తున్నా కొద్ది ఇక్కడ అక్రమార్కుల ఆగడాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.  డబ్బు సంపాదించుకోవడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు కొంతమంది. యువతను పెడద్రోవ పట్టిస్తూ కొందరు బడా బాబులు చేసే దందాలు చూస్తుంటే ఛీ అనిపిస్తుంది. తాజాగా మాసాజ్ ముసుగులో వ్యభిచారం చేస్తూ కొందరు పట్టుబడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖప్నటం వంటి నగరాల్లో మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు అంటూ బయట బోర్డు పెట్టడం లోపల మాత్రం చీకటి దందాలు చేయడం బాగా అలవాటైపోయింది. అంతే కాదు వీరికి నెట్ వర్కు కమ్యూనికేషన్ కూడా బాగా పెరిగిపోయింది, విటులను ఆకర్షించడానికి ఆఫర్లు కూడా పెడుతున్నారు.

మాసాజ్ చేస్తున్న మహిళ


తాజాగా హైదరాబాద్లో కొన్ని చోట్ల మసాజ్ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు పోలీసులు ఏఎస్ రావు నగర్‌లోని ఓ సెంటర్‌పై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ సమయంలో ఒక మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు విటులు, మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: