ఈ రోజు గండిపేట వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత ఏపీ మంత్రి పరిటాల సునీతల కుమారుడు పరిటాల శ్రీరామ్ ప్రత్యేక  ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా తెలుగు దేశం నాయకులతో ఆయన సందడిగా తిరగడం అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం చూస్తుంటే రాజకీయాలపై ఆయకు ఆసక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. అంతే కాదు పరిటాల శ్రీరామ్ కూడ  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.


తెలుగు దేశం మహానాడు లో నారా లోకేష్ బాబు సందడి


  పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ టీడీపీ యువ నేత నారా లోకేష్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు  అనంతపురం జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడంపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ, లేక ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలనే విషయంపై ప్రస్తుతం ఆలోచించడం లేదన్నారు. గతంలో తనపై కొన్ని వదంతులు వచ్చాయని అవి మొదటి నుంచి తమ కుటుంబం అంటే గిట్టని వాళ్లు సృష్టించినవే అని రకరకాల వదంతులు వస్తుంటాయని  వాటిని పట్టించుకోవద్దన్నారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ మంచి నాయకుడు అవుతాడని ఆయన వెంట మేం ఉంటామని  పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. 


మహానాడులో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ వీక్షిస్తున్న నారా లోకేష్ 


మరింత సమాచారం తెలుసుకోండి: