ఆడవారిపై జరిగే అన్యాయాలపై గొంతెత్తి అరిచినా చెవిటి వారి ముందు శంఖం ఊదిన తీరుగా మారుతుంది. మహిళల భద్రతకు నిర్భయ వంటి ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్ల ఆగడాలు మాత్రం తగ్గడంలేదు. పొలంలో తల్లికి చేదోడుగా పని చేస్తున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు,  ఆ క్రమంలో తల్లి అడ్డుపడింది. దాంతో ఆగ్రహించి సదరు యువకులు... తల్లిని  చెట్టుకు కట్టేసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకుంది.

బాధితురాలిని గురువారం గ్రామస్థులు రక్షించారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులలో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు రజనీష్, సచిన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: