ఇంట్లో ఆర్థిక పరిస్థితుల మూలంగానో.. లేదా పట్నం బతుకులు చాలా బాగుంటాయి అని నమ్మివచ్చే అమ్మాయిలు కొందరు మృగాళ్ల చేతుల్లో చిక్కి జీవితాలు అర్పించుకుంటారు. తాజాగా ఒక అమ్మాయికి ఉద్యోగం ఎర చూపి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మంది దుర్మార్గులు ఓ యువతిని అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   హైదరాబాద్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ విజయవాడ లో బాధితురాలిని కాంటాక్ట్ చేసింది దీంతో అమాయకంగా నమ్మి వచ్చింది ఆ అమ్మాయి.


అంతే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మెదక్ జిల్లా సిద్దిపేట లోని ఓ హోటల్ లోకి తీసుకెళ్ళింది ఆ మహిళ. మత్తు మందు ఇచ్చి నిద్రలోకి జారుకునేలా చేసింది అంతే అదును చూసి పదిహేను మంది మృగాళ్లలా రెచ్చిపోయారు ఆ అమ్మాయి పై అత్యాచారం చేసారు ? ఎలాగో అలా ఆ అమ్మాయి అక్కడ నుంచి బయట పడి పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: