తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మహానాడులో ప్రమాణస్వీకారం చేశారు. గండిపేటలో నిర్వహించిన తెదేపా మహానాడు కార్యక్రమం చివరిరోజు భాగంగా ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఇందుకుగాను చంద్రబాబు తరుపున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఆయన చేత పార్టీ సీనియర్‌ నేత పెద్ది రెడ్డి ప్రమాణం చేయించారు.


మహానాడుకు వస్తున్న చంద్రబాబు నాయుడు


‘‘నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా, కుల, మత ప్రాంతీయతలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనసా, వాచా, కర్మేనా, నీతివంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు శుక్రవారం నుండి జాతీయఅధ్యక్షునిగా కొనసాగనున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పాటు పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు అనివార్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: