నవ్వుల హీరో అల్లరి నరేష్ వివాహం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నరేష్, విరూపల పెళ్లి వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా... పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. 

అల్లరి దంపతులను ఆశీర్వదిస్తున్న చంద్రబాబు..


సాధారణంగా.. సెలబ్రెటీల పెళ్లి వేడుకలకు ముఖ్యమంత్రుల వంటి వారు.. సరిగ్గా సమయానికి వస్తుంటారు. పెళ్లి మొదలై.. కార్యక్రమం పూర్తయ్యేలోపల ఎప్పుడో ఓసారి వచ్చి ఓ పదినిమిషాలు కూర్చొని వెళ్లిపోతుంటారు. ఐతే.. అల్లరి నరేశ్ పెళ్లిలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. 

ఏపీ సీఎం చంద్రబాబు ఈ పెళ్లి వేదికకు చాలా ముందుగానే వచ్చేశారు. చంద్రబాబు వచ్చేటప్పటికి.. కనీసం అల్లరి నరేశ్ జంట పెళ్లిపీటలపై కూడా కూర్చోలేదు. చంద్రబాబును నరేశ్ కుటంబీకులు ఆహ్వానం పలికి కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అల్లరి జంట పెళ్లి పీటలెక్కింది. అప్పటికే కొద్దిసేపు వేచి ఉన్న చంద్రబాబు.. పెళ్లి కార్యక్రమం మొదలవ్వగానే.. వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: