భారత దేశం అంతగా ఈ మధ్య ఓ న్యూస్ ప్రకంపనాలు సృష్టించింది అదే నండి పిల్లలకు అతి ఇష్టమైన స్నాక్స్ పెద్దలకు అతి సులభమైన వంటకం మ్యాగీ నూడుల్స్.  తాజాగా ఈ నూడుల్స్ వ్యవహారం ఎనభైవ దశకంలో తన అందచందాలతో, అద్భుతమైన డ్యాన్స్ తో బాలీవుడ్ ను షేక్ చేసి అందాల నటి మాధురీ దీక్షిత్ మెడకు చుట్టుకుంది. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కు హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 9ఎఫ్ డీఏ నోటీసు జారీ చేసింది.


మ్యాగీ 

Why Actress Madhuri Dixit is Now Caught in Maggi Noodle Controversy

'టు మినట్స్ న్యూడుల్స్' పేరుతో వచ్చిన మ్యాగీ వాణిజ్య ప్రకటనలో నటించినందు కు ఆమెకు ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరినట్లు హరిద్వార్ ఎఫ్ డీఏ అధికారి తెలిపారు. లేని పక్షంలో ఈ బాలీవుడ్‌ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్‌ జోషి తెలిపారు. కాగా మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నట్లు ఇటీవలే వెలుగులోకి రావడంతో ఒక బ్యాచ్ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: