తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరంగా తీర్చి దిద్దే పనిలో రాష్ట్ర పాలకులు ఉన్నారు. మహానగరంగా విస్తరిస్తే అందరూ హర్షిస్తారు కానీ అదే రీతిలో ఇక్కడ హైట్ హంగులతో పాటు హైటెక్ మోసాలు, హైటెక్ వ్యభిచారాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈజీ మనికోసం ఎన్ని తప్పుడు పనులైనా చేసి తమ లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వాళ్లు కొందరు, సొసైటీలో లగ్జరీగా బతకడానికి ఎంతకైనా తెగించే యువతులు మరికొందరు. ఇలా హైదరాబాద్ నగరంలో హైటె వ్యభిచార అడ్డాలు బాగా పెరిగిపోతున్నాయి.


మసాజ్ చేస్తున్న దృశ్యం


అంతే కాదు వ్యభిచార గృహాలు అని ప్రత్యేకంగాంగా చెబితే పోలీసులతో ఇబ్బంది కలుగుతుందని హైటెక్ మోసగాలు వీటిని మసాజ్ సెంటర్లు గానో, బ్యూటీ పార్లర్ గానో నడుపుతూ లోపల మాత్రం చీకటి దందాలు చేస్తున్నారు. విటులను ఆకర్షించడానికి రక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అంటే సైట్ ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ఆకర్షించి వారి నుంచి డబ్బుల గుంజడం మొదలు పెట్టారు. తాజాగా హైదరాబాద్ లోని ఎ ఎస్ రావు నగర్ లో ఈ వ్యవహారం బయట పడింది. మసాజ్ సెంటర్ ల పై దాడి చేసిన పోలీస్ లు ఇద్దరు మహిళలను వారితో పాటు ఉన్న ఇద్దరు విటులను పట్టుకున్నారు. ఈ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసారు. వారిని కుశాయి గూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: