లక్ష్మీపార్వతి అన్న నందమూరి తారకరామారావు సతీమణిగా అందరికీ పరిచయమే.. ఇప్పుడు ఆమె వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్మన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపార్వతి ఇంట్లో మృతుడు గత సంవత్సరం నుంచి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు, మృతుడి పేరు రాజు. అయితే రాజు కుటుంబం లక్ష్మీపార్వతి ఇంటి వెనకాలే చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అతని భార్య, కూతురు నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా ఇదే ఇంట్లో ఉంటున్న స్వామికి, రాజుకి గొడవలు అవుతున్నాయి కాగా స్వామి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. స్వామికి, రాజుకి గురువారం తీవ్ర వాగ్వివాదం జరిగింది.
వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి
గురువారం బయటకు వెళ్లిన రాజు భార్య , కూతురు ఇంటికి వచ్చే సరికి రాజు ఉరి వేసుకొని చనిపోయిన దృశ్యం చూసి వారు బోరున విలపించారు, విషయం స్థానికులకు తెలిపారు. పోలీసులు అక్కడకు వచ్చి మృత దేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు కానీ స్థానికులు అడ్డుకున్నారు రాజుని చంపింది స్వామి అని విషయం తేల్చే దాకా మృతదేహాన్ని కదిలించేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు స్వామిని అరెస్టుచేశారు
మృతుడి ఇంటివద్ద స్థానికులు