వర్షాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు తిరుమల  శ్రీవారి దర్శనార్థం తిరుపతి బయలు దేరారు. ఈయనతో పాటు గవర్నర్ నరసింహాన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడానికి తిరుమల వెళుతుండగా ఆయన కాన్వాయ్ లోని ఓ కారు ప్రమాదానికి గురైంది.

అలిపిరి చెక్ పాయింట్ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కారు కొంచెం డ్యామేజ్ అయ్యిందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు ప్రమాదం జరిగిన కారును పక్కన పెట్టి కాన్వాయ్ లు యధావిధిగా పోనిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: