తెలంగాణలో మొన్నటి వరకు ఓటుకు నోటు వ్యవహారం హాట్ టాపిక్ అయితే.. ఇప్పుడు  కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని.. అయితే దీనిపై స్పందిస్తూ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్, జానారెడ్డిలు టిఆర్ఎస్‌లోకి వెళ్తున్నారు అన్న వార్తలు అవాస్తవమని వారు సీనియర్ నాయకులు అలాంటి నిర్ణయాలు వెంటనే ఎలా తీసుకుంటరాని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, డి.శ్రీనివాస్


జానారెడ్డి ఎంపీ వినోద్ తో భీటీ అయ్యారన్న విషయం తనకు తెలియదని ఒకవేళ మాట్లాడుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అయి ఉండవచ్చు అని అన్నారు. ఒకవైపు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేశారని.. త్వరలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు.ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలవల్ల ఇప్పుడు అందరూ సందిగ్ధంలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: