భారత దేశం గొప్ప విదేశీ పర్యాటక కేంద్రం.. ఇక్కడి సంస్కృతి, విజ్ఞానం, ప్రకృతి అందాలు చూడటానికి తెలుసుకోవడానికి చాలా మంది విదేశీయులు వస్తుంటారు. అంలాంటి వారిని ఎంతో గౌరవించి వారికి సాదరంగా ఆహ్వానం పలకాలి కానీ కొందరు మృగాళ్లు కామంతో కళ్లు మూసుకు పోయి ఓ విదేశీ మహిళను అందునా 51 సంవత్సరాల వయసు ఉన్న మహిళలపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన జరిగి సుమారు సంవత్సరం అయ్యింది.. బుధవారం నాడు బాధితురాలు కోర్టులో తాను ఎదుర్కోన్న ఘటనను వివరిస్తూ బోరునా విలపించింది.  

గత ఏడాది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక డచ్ దేశస్థురాలిపై కొందరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు, అడ్రస్ తెలియక ఆ దుర్మార్గుల వద్దకు వచ్చి సహాయం కోరిందట అడ్రస్ చూపిస్తామని చెప్పి తనను బలవంతంగా తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేయబోతుంటే తప్పించుకోవడానికి తనకు ఎయిడ్స్ ఉందని చెప్పిందట కానీ ఆ దుర్మార్గులు వినలేదట  కత్తితో బెదిరంచి మరీ  పైశాచికంగా ఆమెపై ఒకరి తర్వాత ఒకరు కామవాంచ తీర్చుకున్నారట. బాధితురాలు కోర్టులో తాను అనుభవించిన నరకాన్ని గుర్తుకు చేసుకొని బోరున విలపించింది. తన దగ్గర దోచుకున్న వస్తువులను, నిందితులని గుర్తించింది. ఎనిమిదిమంది నిందితుల్లో ఇద్దరు మైనర్లు వుండడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: