రైతు కష్టాలు తీరుస్తాము.. రైతే రాజన్న అనే ప్రభుత్వాలు రైతుల మరణాల పట్ల కొంచెమైనా కనికరం ఉండదు. ప్రకృతి లో ఎలాంటి విపత్తు రానంత వరకు రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండక పోవొచ్చేమో కాని ఈ కాలంలో సంబంచే విపత్తులకు రైతు ఎప్పుడో సంతోషాన్ని కోల్పోయాడు.  వివరాల్లోకి వెళితే అనంత పురం జిల్లా ఉరవకొండ లో నివసించే కోదండరాం తల్లిపేరు మీద ఉన్న పంట రుణం చెల్లించాడు కానీ దాని తాలూకు పాస్ పుస్తకం బ్యాంకు అదికారులు ఇవ్వడం లేదని మనస్తాం చేందాడు.

దీంతో  కోదండరాం  పురుగుల మందు తెచ్చుకొని అదే బ్యాంకు లో  ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు కోదండరాంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  ఆయన మీదే ఆదారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: