ఒకప్పుడు ముంబాయి నగరాన్ని గజ గజలాడించిన మాఫియా డాన్..  ముంబాయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి దావూద్ ఇబ్రహీం తనతో మాట్లాడాడని ప్రముఖ న్యాయవాది  రాంజెఠ్మలానీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పేలుళ్లతో తనకు సంబంధం లేదని దావూద్ చెప్పాడని తెలిపారు. భారత్‌లో దావూద్ లొంగిపోయేందుకు, విచారణకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆయన గతంలో తనతో లండన్‌లో మాట్లాడినట్టు ఆయన అన్నారు.


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం


భారత్‌లో ప్రాణభయంవుందని చెప్పారని తెలిపారు అంతే కాదు తను చేసిన నేరాలు ఒప్పుకుంటానని తనపై థార్డ్ డిగ్రీలాంటివి చేయొద్దని కోర్టు విధించే శిక్ష భరిస్తానని తనతో తెలిపినట్లు జఠ్మాలనీ అన్నారు. . కేసు విచారణ జరుగుతున్నంత సేపు గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తే లొంగిపోయేందుకు దావూద్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు.మాఫియా డాన్‌తో ఫోన్‌లో మాట్లాడానని రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: