ప్రేమ గుడ్డిది అంటారు.. ప్రేమకు వయసు అడ్డు రాదని అంటారు..కాకపోతే దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి. తాజాగా తమిళనాడులో ఓ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి వివాహం చేసుకున్నాడు ఇందులో ఆశ్చర్యమెమిటీ అంటారా..? మరి ఆ కుర్రోడు చేసుకున్నది ఎవరినో కాదు తనకు చదువు చెప్పే టీచమ్మనే..!  ఈ సంచలన సంఘటన తమిళనాడు లో జరిగింది. అయితే ఈ మద్య ఇలాంటి సంఘటనలు తమిళనాడులో అక్కడక్కడా పదుల సంఖ్యలో జరిగాయి.

విషయానికి వస్తే.. తమిళనాడులో పదవ తరగతి చదువుతున్న అజిత్ అనే విద్యార్థి అదే  స్కూల్ లో పాఠాలు బోధిస్తున్న వైష్ణవి అనే టీచర్ ని ప్రేమించాడు. నిజానికైతే ఇలా చేసినందుకు విద్యార్థికి క్లాస్ తీసుకుని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది పోయి అతడి ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకుంది. ఈ తంతు మొత్తం పెద్ద ల సమక్షంలోనే జరగడం మరో విశేషం. ఇక పోతే ఈ సంఘటనతో ఆ స్కూల్ ఒక్క సారిగా సంచలనం రేపింది.

విద్యార్థి అజిత్ వివాహమాడిన టీచర్ వైష్ణవి


అయినా లవ్ అంటూ వచ్చిన విద్యార్థిని చెంప చెల్లుమనిపించకుండా టీచరమ్మ కూడా ఓకే చెప్పటడం ఏమిటీ అంటూ అందరూ తిట్టుకోవడం మొదలు పెట్టారు ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్ ఎమౌతుందీ అని తల్లిదండ్రులు ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ వయసు కూడా చాలా వ్యత్యాసం అబ్బాయికి 14 సంవత్సరాలు అయితే టీచరమ్మకు 30 సంవత్సరాలు కావడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: