ప్రపంచ దేశాల్లో భారత దేశానికి గొప్ప స్థానం ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఇక్కడ పెట్టింది పేరు. ఏక్కడా లేని దేవుళ్లు మన భారత దేశంలోనే ఉంటారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే విదేశీయులకు ఎంతో మక్కువ. ప్రతి యేటా భారత దేశాన్ని సందర్శించడానికి చాలా మంది వస్తుంటారు. అయితే ఇలాంటి భారత దేశంలో కొందరు కామాంధులు తమ పైశాచిక చర్యలతో దేశ పరువు తీసేస్తున్నారు.  ఇక దేశ రాజధాని అంటూ గొప్పలు చెప్పుకొనే మంత్రులు, నాయకులు, వ్యాపారవేత్తలు అక్కడ జరిగే అన్యాయాలపై మాత్రం మిన్నకుంటారు. తాజాగా ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించడం కోసం భారత్‌ వచ్చిన అమెరికా యువతి(20)పై ఓ టాక్సీ డ్రైవర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ దారణంపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. 

ఇక విషయానికి వస్తే.. ఇక్కడ ధార్మిక క్షేత్రాలు, ఢిల్లీ అందాలు చూడాలని అమెరికా నుంచి ఓ యువతి వచ్చింది..చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో  ఒక హోటల్ లో బస చేసింది. అయితే పర్యాటక ప్రదేశాలు చూడటం కోసం స్థానికంగా ఒక ట్యాక్సీ అద్దెకు మాట్లాడుకుంది.ఆ టాక్సీ డ్రైవర్ పేరు  దేవరాజ్ చవాన్ కొన్ని ప్రదేశాలు చూపించి ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఈ విషయం ఎవరికైనా చెబితే నిర్ధాక్షిన్యంగా చంపేస్తానని బెదిరించాడు.  భయంతో ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంది.  

ఈ సంఘటన ఈ నెల 24 న జరిగింది. కాగా యువతి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ వెళ్లాక జరిగిన దారుణాన్ని స్నేహితులకు తెలిపింది. వారి సాయంతో జులై 28న డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నింధితునిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాకపోతే నేరం జరిగిన ప్రదేశం ఢిల్లీ కావడంతో తదుపరి దర్యాప్తు కోసం చిత్తరంజన్‌ పార్క్‌ ఠాణాకు బదిలీచేశామని అహ్మద్‌నగర్‌ ఎస్పీ సౌరభ్‌ త్రిపాఠి తెలిపారు. కేసు నమోదు చేశాక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకుంటామని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: