ఈ మద్య కాలంలో యువతలను స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అదును చూసి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు కొందరు కామాందులు. స్నేహితుడు అని నమ్మి అతని వెంట వెళ్లినందుకు తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ చెందిన ఒక యువతిని 17 సంవత్సరాల బాలికను ఆమె స్నేహితుడు (20) బయటకు వెళుదామని నమ్మించాడు.
ఆ బాలికను తీసుకొని అహ్మదాబాద్ లోని మణినగర్ లోని ఒక ప్రయివేటు హోటల్ లోకి వెళ్లారు. కొంత సేపు తర్వాత ఆ యువకుడు బయటకు వచ్చాడు అతని ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి హోటల్ కి పిలిపించాడు. ఈ విషయం తెలుసుకొనే లోపే ఆ అమ్మాయిని ఐదుగురు యువకులు నిర్భందించి సామూహిక అత్యాచారం చేశారు. తనను వదలమని ఎంత బ్రతిలాడినా వినకుండా ఇష్టం వచ్చినట్లు ఆమె శరీరంతో ఆడుకున్నారు. నిస్సాహ స్థితిలో ఉన్న ఆ బాలిక పైశాచికంగా అనుభవించారు. తర్వాత వారినుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.