రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ..! అన్న సామెత గుర్తుకు ఉంది కదా.. అవును ఈ విషయం తెలిస్తే మీరు కూడా అదే అనుకుంటారు.. ఏపీ సీఎం చంద్రబాబు తన పరిపాలనలో మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారట.. మరి ఆ ర్యాంకుల్లో మొదటి ర్యాంకు ఎవరికి ఇచ్చారో తెలుసా.. హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణకు మొదటి ర్యాంకు ఇచ్చారు.

తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పై ఆ పార్టీలో ఎలా ఉన్నా ఇతర పార్టీల నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బాలకృష్ణకు మొదటి ర్యాంకు ఇవ్వడంపై సిపిఎం ఆక్షేపించింది.ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ లో నివిసిస్తూ ,అప్పడప్పుడు వచ్చి వెళ్లే బాలకృష్ణకు జిల్లాలో మొదటి ర్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆయన సినిమాల్లో బిజీగా ఉంటారు, హిందూ పురంలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటారు అంటూ విమర్శించారు.

చంద్రబాబు భవిష్యత్ లో బాలకృష్ణతో అపాయముందని ఊహించి లేక తనకు డ్డు వస్తాడన్న అనుమానంతో నో ఈ ర్యాంకు ఇచ్చి ఉండాలని ఆయన అన్నారు. డబ్బులు లేవంటూనే గోదావరి పుష్కరాలకు రూ.1500 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. కాగా, ఏపీ ప్రభుత్వం పని తీరు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా సర్వే చేయించింది.  ఈ ర్యాంకులన్నీ బోగస్సేనని అని ధ్వజమెత్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: