చంద్రబాబును ఎక్కువగా తిట్టే మహిళానేతల్లో రోజా ఫస్ట్ ప్లేస్ ఆక్రమించేస్తున్నారు. మొదట్లో కాస్త ఆచితూచి మాట్లాడే ఈ నాయకురాలు.. ఈ మధ్య జోరు ఫుల్లుగా పెంచేస్తున్నారు. అయితే ఆ విమర్శలు మరీ నేలబారుగా.. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టుగా ఉంటున్నాయట. ఈ విషయాన్ని టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ బయటపెట్టారు. 

ఢిల్లీ వెళ్లొచ్చిన చంద్రబాబుకు అసలు ప్యాకేజీకి, ప్రత్యేక ప్యాకేజీకీ తేడా తెలియడం లేదని రోజా విజయవాడ వద్ద జరిగిన ధర్నాలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మారుస్తూ.. ప్రత్యేక ప్యాకేజీ పాట పాడుతున్నారని విమర్శించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన అనురాధ.. అసలు ప్యాకేజీకి, ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న తేడా రోజా చెప్పగలదా అని విమర్శించారు. 

చంద్రబాబుకు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడం మాత్రమే తెలుసన్న అనురాధ.. రోజాపై ఘాటు విమర్శలు చేశారు. రోజా.. ఏ ప్యాకేజీ తీసుకుని టీడీపీ నుంచి పార్టీ మారిందో చెప్పాలని నిలదీశారు. టీడీపీలో ఉన్పప్పుడు ఒక ప్యాకేజీ, వైసీపీలో ఉన్నప్పుడు మరో ప్యాకేజీ మాట్లాడుకోవడం రోజాకు అలవాటేమో అంటూ సెటైర్లు వేశారు అనురాధ. 

రోజాకు రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదని అనురాధ మండిపడ్డారు. అలాంటి రోజా తమ పార్టీ అధినేతపై ఊ అంటే చాలు విరుచుకుపడిపోతోందని..అది మంచిపద్దతి కాదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రధాన మంత్రిలా మాట్లాడుతున్నారని రోజా అనడంపై అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు ప్రధానిలా మాట్లాడితే మీకేంటి నొప్పి అని ప్రశ్నించారు. రాష్ట్ర్రం కోసం ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని కూడా చంద్రబాబు వదిలేశారని అనురాధ గతం గుర్తు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: