తెలుగు చిత్ర సీమలో మంచి ఫామ్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ‘జనసేన’ పార్టీ స్థాపించారు. ప్రశ్నించేందుకు వస్తున్నా అన్ని నినాదంతో ప్రజల్లోకి వెళ్లాడు. పార్టీ స్థాపించిన సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ ప్రత్యక్షంగా పోటీ చేయకుండా బీజేపీ,టీడీపీలకు మద్దతు ఇచ్చి వాటి గెలుపునకు పరోక్షంగా సహాయం చేశాడు. గత కొంత కాలంగా పవన్ కళ్యాన్ రాజధాని భూ సేకరణ విషయంలో... రైతులకు అన్యాయం జరుగుతుందని వారి వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కుంటే దేనికైనా సిద్దమే అని రైతులకు జనసేన పార్టీ తరుపునుంచి హామీ ఇచ్చాడు.

తాజాగా ఏపీ ప్రభుత్వం జనసేన అధినేత,   పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరూ రైతులనూ ఒప్పిస్తామని, వారి ఇష్ట ప్రకారమే భూములు తీసుకుంటామని, ఎవరినీ బలవంతం పెట్టబోమని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి భూసేకరణ వద్దనే అంటున్నారని, అయినా సమయం ముంచుకొస్తుండటంతో తాను భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయించానని నారాయణ అన్నారు. ఇప్పుడు భూసేకరణ బిల్లు పైన తాము వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రైతులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాన్


రెండు రోజుల్లో గ్రామ కంఠాల పైన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పీ నారాయణ చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ అనంతరం భూసమీకరణ ద్వారా మరో వెయ్యి ఎకరాలను తాము సేకరించామని ఆయన తెలిపారు. రైతులను ఒప్పించి భూమిని సేకరిస్తామన్నారు.  భూసేకరణకు చంద్రబాబు వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమీకరణ విధానంలోనే రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలన్నదే బాబు అభిమతమని.. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరు రైతులను, ఒప్పించి భూముల్ని తీసుకుంటామని చెప్పారు. గ్రామకంఠాలపై రైతుల్లో ఆందోళన వద్దని, సోమవారంలోగా సమస్యను పరిష్కరిస్తామని నారాయణ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: