భూమిపై దేవుడు తనకు మారుగా అమ్మను పంపాడని ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే నవమాసాలు మోసీ కనీ పెంచుతుంది అమ్మ..అందుకు అమ్మను మించి దైవమున్నదా అని అంటారు. అలాంటి అమ్మతనానికే కళంకం తెచ్చింది ఓ తల్లి. పేరు ప్రఖ్యాతులు ఉండీ కూడా కావల్సినంత డబ్బు ఉండీ కూడా జల్సాల కోసం కన్న కూతురినే హత్య చేసినట్లు ఒప్పుకుంది ఓ తల్లి.  పోలీసులు ఖంగు తినేలా మీరకున్నట్టుగా షీనా బోరాను నేనే చంపాను అని స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జియా చెప్పారు. ఈ మేరకు ముంబై పోలీసుల విచారణలో ఆమె అంగీకరించినట్టు సమాచారం.  

ఇక ఈమె హత్య చేయడానికి గల కారణాలు ఏమిటో పోలీసులు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉంది.  తన కడుపున పుట్టిన బిడ్డ షీనా బోరాను హత్యచేసింది తానేనని ఇంద్రాణి అంగీకరించింది. పోలీసుల విచారణలో దాదాపు వారం రోజుల పాటు మౌనం పాటించిన ఆమె, ఎట్టకేలకు నోరు విప్పి తప్పు ఒప్పుకుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.  అయితే నిన్నటి వరకు తాను తన బిడ్డ షీనా బోరాను చంపలేదని, ఆమె అమెరికాలో బతికేవుందని, తనంటే ద్వేషంతోనే షీనా బయటకు రావడం లేదని ఇంద్రాణి వెల్లడించినట్టు తెలుస్తోంది. షీనా బోరా హత్యకు గురైన దాదాపు మూడేళ్లకు షీనాను, ఆమె రెండవ భర్త సంజీవ్ ఖన్నాను, కారు డ్రైవర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇంద్రాణి విచారణలో చెబుతున్న విషయాలతో, పోలీసులే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జియా


మొత్తానికి  మంగళవారం నాటి విచారణలో ఆమె చేసిన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.  ఇంద్రాని నేరం అంగీకరించినా.. మాకు కొన్ని అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తాం' అని ఓ పోలీసు అధికారి వివరించారు. ఇదిలావుండగా, రాయగఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతం నుంచి సేకరించిన నమూనాలు షీనావేనని గుర్తించేందుకు, ఆమె తండ్రిగా ప్రపంచానికి పరిచయమైన సిద్ధార్థ దాస్ను ముంబై రప్పించి డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: