మొన్నటి వరకు గోదావరి జిల్లాల్లో సైకోసూదిగాడు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటి వరకు నింధితుల ఊహాచిత్రాలు మాత్రమే విడుదల చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆ నింధితులను పట్టుకోలేక పోయారు.. అంతే కాదు అసలు ఈ గ్యాంగ్ లో ఒక్కరా లేదా గ్రూప్ ఉన్నారా అన్ని విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ సైకో కోసం ఏపి పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముందు ఆడవాళ్లను టార్గెట్ గా చేసిన సైకో.. తర్వాత మగవాళ్లను కూడా టార్గెట్ గా చేసుకున్నాడు.

ఎక్కడి నుండి వస్తాడో తెలియదు.. ఎలా వస్తాడో తెలియదు.. కానీ వస్తాడు సూదితో దాడి చేస్తాడు వెళ్తాడు. అంతే సూదిగాడు చేస్తున్న దాడులతో గోదావరి ప్రజలు విస్తుపోతున్నారు..  తాజాగా అలాంటి సైకో దాడి హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో గౌతమ్ నగర్ వద్ద నాలుగో తరగతి చదువుతున్న  విద్యార్థిని మీద గుర్తుతెలియని వ్యక్తి సూది తో దాడి చేశాడు. ఎవరు చేశారో తెలియదు కానీ సూదితో దాడి జరిగినట్లు స్పష్టమైంది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రమ్య అనే బాలికను వెంటనే స్థానికలు ఆస్పత్రికి తరలించారు.

మల్కాజ్ గిరిలో సైకో ఘటనతో నగర పరిధిలో పేరెంట్స్ లో గుబులు మొదలయింది..పిల్లల్ని స్కూలుకు పంపాలంటే ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. సైకోలు ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారా లేక వాడే ఇక్కడికి వచ్చాడా అనేది తేలాల్సి ఉంది..ఎందుకంటే గోదావరి జిల్లాల్లో నాలుగురోజులగా సూదిగాడు ఆచూకీ లేదు..ఎటువంటి ఘటనలు కూడా సంభవించలేదు..హైదరాబాద్ పోలీసులు వెంటనే అలర్ట్  అయ్యారు. ఆ నింధితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేస్తున్నాట్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: