ఈ మద్య మహిళలపై కామాంధుల లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం..చదువుతూనే ఉన్నాం. ఈ కాలంలో మహిళలు,యువతులు చివరకు అమ్మాయిల అస్సలు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా... రోజు మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. చట్టాన్ని కాపాడాల్ని ఓ పోలీసుల కామ వాంచ కోసం మనవరాలి వయసు ఉన్న బాలికను లోబర్చుకొని  లైంగికంగా వాడుకోవడం సంచనం రేపింది.


వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చవిదే విద్యార్థిని కానిస్టేబుల్ ఈశ్వరయ్య లొబర్చుకొని గత కొంత కాలంగా ఆ విద్యార్థినిపై తన కామవాంచ తీర్చుకుంటున్నాడు.. ఇందు కోసం  ఆ హాస్టల్ లో పనిచేస్తున్న వంట మనిషి సహాయం తీసుకున్నాడు. అభంశుభం తెలియని చిన్నారిని ఆ పనిమనిషి మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి ముసలి వయసు ఉన్న పోలీసు కు అప్ప చెప్పింది. ఇప్పుడు మైనర్ బాలిక మీద తన వాంఛను తీర్చుకున్న ఖాకీ మీద సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు.


అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన దారుణం పోలీస్ శాఖకే తలవంపుగా మారింది పలువురు చర్చించుకుంటున్నారు. అయితే గత వారంలో అనంతపురం జిల్లాలో ఓ స్కూల్ లో విద్యార్థిని ఏకంగా డెలివరి కావడంతో సంచలనం రేగింది.  ఈ విషయాన్ని కలెక్టర్ కోన శశిధర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై వెంటనే విచారణ జరిపించాల్సిందిగా కింది స్థాయి సిబ్బందిని ఆదేశించారు. అనంత పురంలో మొత్తం 62 కస్తూర్భా పాఠశాలలు ఉన్నాయి. గురుకులాల్లో విద్యార్థుల రక్షణకు సంబందించిన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: