గత కొంత కాలంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులను వణికిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్న సైకో సూదిగాడు ఇంకా చిక్కలేదన్న విషయం తెలిసిందే. మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన సైకో సూదిగాడు తరువాత తూర్పు గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడా ఇంజక్షన్ దాడులు చేశాడు. అయితే ఒకే సమయంలో వివిధ ప్రదేశాలో సూది తో దాడి చేయడంతో సైకో సూదిగాడు ఒకడు కాదు.. ఇద్దరో లేక ఎంత మందో అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఒక మహిళా సైకో కూడా ఇంజక్షన్ దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు గోదావరి జిల్లాలోనే జరిగిన ఇంజక్షన్ దాడులు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరగడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దాడులు ఎంత మంది చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో ఇంకా తెలియరావడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు సూదిగాడిని పట్టుకున్నామని చెప్పినా కేవలం అనుమానితుడే అని చెబుతున్నారు. ఆంధ్రాలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఉన్మాదంగా ప్ర‌వ‌ర్తించే సైకో సూదిగాళ్ల బెడ‌ద ఈ మ‌ధ్య కాస్త ఎక్కువే అయింది.

ఒక‌రిని నుంచి ఒక‌రు త‌యారౌతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. వ‌ర‌సుగా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు కూడా భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యారు. తాజాగా బ‌ల్లార్షా నుంచి సికింద్రాబాద్ వ‌స్తున్న రైల్లో ఈ సైకో ప‌ట్టుబ‌డ్డాడు. ఈ సైకోగాడు ఘ‌న్‌పూర్ వ‌ద్ద రైల్లోకి ఎక్కాడు. అక్క‌డి నుంచి వ‌ర‌స‌గా భోగీల్లోకి చొర‌బ‌డుతూ ప‌లువురికి ఇంజెక్ష‌న్లు గుచ్చడం ప్రారంభించాడు... దీంతో స్పందించిన కొంత‌మంది ప్ర‌యాణికులు వాడిని ప‌ట్టుకుని చిత‌క‌బాదేశారు.

ఈ ఉన్మాది స్టేషన్ ఘనపూర్ లో రైలు ఎక్కినట్లు చెబుతున్నారు. అతని వద్ద నుంచి రెండు సిరంజీలు, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రాలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఉన్మాదంగా ప్ర‌వ‌ర్తించే సైకో సూదిగాళ్ల బెడ‌ద ఈ మ‌ధ్య కాస్త ఎక్కువే అయింది. ఒక‌రిని నుంచి ఒక‌రు త‌యారౌతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. వ‌ర‌సుగా సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు కూడా భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యారు. తాజాగా రైల్లో దొరికిపోయిన సూదిగాడి… ఆంధ్రాలోని సైకోగాడు ఒక్క‌డేనా కాదా అన్న‌ది ఇంకా తేలాలి. మరో పక్క అతని మానసిక స్థితి బాగా లేదని పోలీసులు భావిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇంటి దగ్గర ఉండట్లేదని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: