ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ తో అటు మావోయిస్టులు ఇటు పోలీసులకు మద్య హోరాహోరి యుద్ద వాతావరణం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున దర్భాఘాట్‌ అనే ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జగదల్ పూర్ జిల్లా దర్బాఘాట్ వద్ద పోలీసులకు ,మావోయిస్టలకు మద్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక మహిళతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారని సమాచారం.

మావోయిస్టులు వంద మంది గ్రామస్తులను కిడ్నాప్ చేశారు.. ఈ క్రమంలో పోలీసులు వారిని అన్వేషించే క్రమంలో హాఠాత్తుగా మావోయిస్టులు ఎదరు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఫైరింగ్ మొదలు పెట్టారు. పోలీసుల  కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. మృతుల్లో ఏరియా కమాండర్ ఉన్నట్టు సమాచారం. ఘటన స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు బయల్దేరి వెళ్లారు.కిడ్నాప్ అయిన గ్రామస్తుల జాడ తెలిసింది లేనిది ఇంకా తెలియరాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: