రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే.. ఒకరిని మరొకరు తిట్టిపోసుకోవడమూ సహజమే.. కానీ దేనికైనా ఓ హద్దు అంటూ ఉంటుంది కదా.. సంస్కారమనే ఆ సన్నటి గీత చెరిగిపోతే.. జనంలో వారిపట్ల గౌరవమూ తగ్గిపోతుంది. ఇప్పటికే జనం రాజకీయ నాయకులంటే అసహ్యించుకుంటున్నారు.. దాన్నిఇంకాస్త పెంచేలా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు..
జగన్ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం మాట్లాడిన కొందరు నేతలు సంస్కారం మరిచిపోయారు. ఓటుకు నోటు కేసు లో జైలుకు పోవాల్సి ఉంటుందన్న భయంతోనే మోదీ చెప్పిన దానికల్లా చంద్రబాబు గంగిరెద్దులా తలూపుతున్నారని కొడాలి నాని తీవ్రంగా కామెంట్ చేశారు. అంతవరకూ ఓకే.. ఆ తర్వాతే శ్రుతి మించారు.
దేవినేని ఉమ ఓ సన్నాసి అంటూ నాని రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పదవి కోసం వదిననే చంపారని తీవ్రమైన కామెంట్లు చేశారు. తాట తీస్తామని ఉమ అంటున్నారని... ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఆయనకు, సీఎంకు తాట తీసి జగన్కు చెప్పు లు కుట్టిస్తామని నాని ఘాటుగా మాట్లాడారు. పోనీ అక్కడితో ఆగారా... అదీ లేదు.
ఎన్నికల ముందు తాను మారానని చంద్రబాబు చెబితే... కాటికిపోయేటప్పుడైనా మారాడులే అని ప్రజలు నమ్మి ఎన్నికల్లో గెలిపించారన్నారు. నరేంద్ర మోడీ , పవన్ కల్యాణ్ల కాళ్లు పట్టుకొన్నా... ఎన్నికల్లో చంద్రబాబు పీకింది తక్కువ మెజార్టీయేనని నాని వెటకారం ఆడారు.మరో వైసీపీ నేత జోగు రమేశ్ కూడా నాని తరహాలోనే రెచ్చిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒక సైకో సూదిగాడని, దేవినేని ఉమ ఒక సైకో సొల్లుగాడని ఘాటుగా కామెంట్లు
చేశారు.