తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రదాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టి ఆరో రోజులు అవుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది..మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో ప్రత్యేక హోదా కోసం మునుకోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత మరి కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.


తాజాగా తిరుపతిలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న మాసుమయ్య అనే విద్యార్థి గత నాలుగు రోజులుగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాడు. ఇప్పటికీ దీక్షపై ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలపకపోవడంపై నిరాశ చెందిన మాసుమయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సమయానికి తోటి విద్యార్థులు అతడిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.


వైఎస్ జగన్ కి వైద్య పరిక్షలు చేస్తున్న వైద్యలు


జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రైల్వే కోడూరులో చోటు చేసుకుంది. జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేక హోదా కోసం సోమవారం కడప జిల్లాలోని రైల్వేకోడూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రంగమ్మ అనే మహిళా కార్యకర్త సూపర్ వాస్మల్ అనే ద్రవం తాగింది. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే గతంలో  ప్రత్యేక హోదా కోసం మునుకోటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వైఎస్ జగన్ స్పష్టంగా ఒకటే చెప్పారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: