భారత దేశంలో సభ్య సమాజం తలదించుకునేలా కొందరు మగాళ్లు మృగాళ్లల మారుతున్నారు..కామంతో చెలరేగిపోతున్నారు..వీరి  కామ వాంచకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వేదింపులు జరుగుతూనే ఉన్నాయి.. ఎక్కడ చూసినా అత్యాచారాలు..పైగా హత్యలు సర్వ సాధారణం అయ్యాయి. చట్టాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పైశాచికమైన వీరి ఆలోచనలతో ఆడది కనిపిస్తే చాలూ కృర మృగంలా రెచ్చిపోతున్నారు.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వ పరంగా ఎన్నిచర్యలు తీసుకున్నవారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. అసలే వికలాంగురాలు ఆ బాలికను ఎవరు చూసినా అయ్యో పాపం అనుకునే వారు.. కానీ ఆ దుర్మార్గుడు మాత్రం కామంతో కళ్లు గప్పి అత్యాచారాని వడిగట్టాడు.. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న పదేండ్ల బాలికపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడి చేశాడు.

కూలీ పని చేస్తే గా గడవని పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు కూలీ పనికోసం బయటకు వెళ్లారు.. ఆ బాలిక తన సోదరుడితో ఆడుకుంటూ ఉండగా ఆదే గ్రామానికి చెందిన నర్సింహులు అనే పోకిరి అక్కడకు వచ్చారు..ఇంటో ఎవరూ లేరని గమనించి తన వాంచ తీర్చుకోవాలనుకున్నాడు..అక్కడ ఉన్నది అమాయకమైన వికలాంగురాలు అన్న విషయం కూడా మరిచిపోయాడు.. తమ్మున్ని బెదిరించి ఇంటి బయటకు వెళ్లిపోమ్మన్నాడు...అంతే ఆ బాలికపై పైశాచికంగా  లైంగిక దాడికి పాల్పడ్డాడు.

పొద్దుపోయాక ఇంటికి వచ్చిన తల్లి, నాయనమ్మలు తీవ్ర రక్తస్రావమై పడిపోయిన ఉన్న బాలికను చూశారు. చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు.  ఆ బాలిక పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.. అత్యాచారానికి పాల్పడిన ఆ కామాందుడు నర్సింహను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: