చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజును వసంత పంచమిగా జరుపుకుంటాం.  మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ వేడుకలను శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేస్తారు. ఈరోజు విష్ణువును కూడ పూజిస్తే మంచి జరుగుతుంది అన్న భావనతో ఈరోజు చాలామంది ఈ పూజలు చేస్తారు.

మాఘమాస ప్రారంభంలో వచ్చే వసంత పంచమి రోజున జరిపే ఈ పూజలను అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకునే ఈపూజలను ఎలా జరుపుకోవాలో  వ్రత చూడామణిలో పేర్కొనబడినది. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. 

సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది.

ఈరోజున సరస్వతీ అమ్మవారి జన్మదినం సందర్భంగా వసంత పంచమి ఉత్సవాలను బాసరలో ఘనంగా నిర్వహిస్తారు.  వసంతపంచమి ఉత్సవాలను ఈరోజు నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈరోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి చదువులు వస్తాయి అన్న నమ్మకంతో ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్న సరస్వతి దేవాలయాలు అన్నీ భక్తులతో కిటకిట లాడుతూ ఉంటాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: