చాలాకాలముగ రాజదంపతులు సంతానములేక విచారించుచుండగ వారి పురోహితులు వచ్చి ప్రభూ! మహారాణిగారు కన్యకోమలి నోమునోచిన, మీకు సర్వలక్షణ సంపన్నులయిన కుమారులు జన్మించెదరని చెప్పెను, రాజుగారటులనే, తన భార్యచేత కన్యకోమలి నోముపట్టించి, వ్రతవిధానమునంతయు, శ్రద్ధాభక్తులతో పూర్తి చేసినంతనే వారికి మంచి రూపమున బలపరాక్రములు, సుగుణములు గలిగిన కుమారులు జన్మించిరి. అంతటి నుండి ఆ రాజు తన పట్టణములో అందరి చేత ఆ వ్రతమును పట్టించెను.