పూర్వకాలమునందొక మహారాజునకు సంతానము లేక భగవానుని గురించి ప్రార్ధించుటకై తన రాజ్యభారమంతయు మంత్రికి అప్పగించి భార్యతోగూడ వనముల బట్టిపోవుచుండెను. పార్వతీపరమేశ్వరులాసమయమున వృద్ధ బ్రాహ్మణ దంపతులవలె యెదురువచ్చి మీరెవరు-యెందుకిటు వచ్చితిరి. మీకేమి కావలయునని అడుగగ మహారాజు " ఆ వివరములన్నియు మీకెందులకు? మీరేమి ఆర్చెడి వారా - తీర్చెడి వారా" అనగ వారు ఆర్చెడి వారము మేమే - తీర్చెడి వారము మేమే" మాకా వివరములు చెప్పమనిరి.