ఒక గ్రామములోనున్న గ్రామ కరణముగారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలిగిరి. కరణముగారు తన కమారులందరకును వివాహములు సేయగ నలుగురు కోడళ్ళ కాపురములకు వచ్చిరి. అటులనే నలుగురు కుమార్తెలను వివాహములు చేసి వారివారి యత్తవారిండ్లకు పంపిరి. కాని వారిలో చిన్న కుమార్తెకు మాత్రము కాల ప్రభావమున స్థిరచరాస్తులన్నియుపోయి ప్రతిదినము దారిద్ర్యము అనుభవించుచున్నందున, బంధువులెవ్వరును వారిని గౌరవించులేక నిరాదరణగ చూచుచుండిరి.