మోచేతి పద్మము వ్రతము యెవరైనను కార్తీకమాసమునందో ఆశ్వయుజ మాసమునందో చేయవచ్చును. వ్రతకర్తలు మాములుగ రెండు పూటల తినెడివారు రెండు పూటలయందును, మూడుపూటల తినిెడివారు ముప్పూటల తినవలయును. హాయిగా స్నానము చేయవలయును, మడిబట్టలు ధరించి తులసిమాత నారాధింప వలయును. తులసి యెదుట నోముపట్టిన తొలియేడు ముగ్గులతో నాలుగు పద్మములు పెట్టి; నాలుగువత్తులున్న దీపమును వెలిగించిన పిమ్మట నలువురు పేరంటాళ్ళకు బొట్టుపెట్టి ఆకాశమును చూసి, నాలుగు చుక్కలు లెక్కపెట్టవలయును.