హిందూ ధర్మం ప్రకారం పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు 108 పూసలుండే జపమాలను సాధారణంగా ప్రతిఒక్కరు ఉపయోగిస్తుంటారు. అయితే.. జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయోనన్న విషయం ఎప్పుడైనా గ్రహించారా..? పూసలు అదే 108 సంఖ్యలో వుండటానికి కొన్ని ఆసక్తికర విషయాలు పురాణ పుస్తకాల్లో తెలుపబడి వున్నాయి.