ఒకానొక రాజుగారికి యిరువురు భార్యలుండిరి. వారిలో చిన్న భార్య గయ్యాళి గంప. అయినను రాజుగారికామెయందె మమకార మెక్కువగ ఉన్నందున చిన్నభార్య చెప్పిన మాటలు విని ఊరివెలుపల నొక మేడగట్టంచి ఆ మేడలో పెద్దభార్య నుంచి ఆమెవలయు ఖర్చులకు గాను కొంత డబ్బు నిచ్చుచు ఆమె ఆసక్తియేలేక యెప్పుడును చిన్న భార్య మందిరమునందే నివసించుచుండెను. రాజుగారి భార్య తనకట్టి కష్టము వచ్చినను చింతింపక పరమేశ్వరుని నారాధించుకొనుచు తన మేడ ప్రక్కగా నొకపూలవనమును పెంచి ఆపూలతో శివారాధనము చేయుచు కాలం గడుపుచుండెను.