sr ntr hd images as sri krishna కోసం చిత్ర ఫలితం



కలి అనగా నేమి? కలియుగంలో ఏమి జరుగుతుంది? ఒకసారి పాండవులంతా (ఆ సమయంలోఅక్కడ ధర్మరాజు లేడు) కలసి శ్రీ కృష్ణుని సమీపించి  "కలియుగం అంటే ఏమిటి? కలి యుగంలో ఏమి జరుగబోతుంది?" అని అడిగారు.


దానికి శ్రీకృష్ణుడు "నేను చెప్పను, మీరే తెలుసుకోండి బావలూ!"  అని చెప్పి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిక్కుల్లో వదలి, నలుగురిలో ఒక్కొక్కరు, ఒక్కోదిక్కు వెళ్లి, తాను  వదిలిన బాణాలను తిరిగి  తెమ్మని చెప్పి పంపించాడు.


భీముడు ఉత్తర దిక్కుగా వెళ్లగా, అక్కడ బాణం పడి  ఉన్న చోట ఐదు బావులు కన్పించాయి. వాటిలో ఒకటి చిన్నదిగా ఉండి పూర్తిగా ఎండిపోయి ఉంది.దానీ చుట్టూ ఉన్న నాలుగు  బావులు పూర్తిగా నిండి పొయి,  అది చాలదా!  అన్నట్లు,  వాటిలో నీరు బయటకు పొంగి పొర్లు పోతుంది. ఈ సంఘటన చూసిన భీముడు ఏమీ అర్ధం కాక బాణం తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు.


అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లి, అక్కడ పడిన బాణాన్ని తీస్తుండగా మధురమైన స్వరం ఒకటి వినిపించింది.  చూస్తే ఒక చెట్టుకొమ్మపై కోకిల కూర్చుని మధురాతి మదురంగా గానం చేస్తూంది. కానీ అది తన కాళ్ల క్రింద ఎలుక నొకదాన్ని పట్టుకుని తినడానికి సిద్దంగా ఉండడం కూడా చూసి " ఇదేమి వింత..!" అనుకుని వెనుకకు వచ్చేసాడు.

yogeshwar krishna కోసం చిత్ర ఫలితం

మూడవ వాడైన నకులుడు పడమట దిశగా వెళ్లి బాణంతో తిరిగి వస్తుండగా దగ్గరలో ఒక ఆవు అపుడే తాను జన్మనిచ్చిన దూడను తన నాలుకతో తుడుస్తుండడం చూసాడు. ఆ ఆవు , దూడ శరీరమంతా తుడుస్తూ ఉండగా కొందరు మనుషులు బలవంతంగా అతి కష్టంమీద ఆ ఆవు నుండి దూడను వేరు చేయడం జరిగింది. ఈ పెనుగులాటలో దూడ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధ పడ్డాడు. చేసేదేమీ లేక వెనుకకు వచ్చేసాడు.


చివరివాడైన సహదేవుడు దక్షిణ దిశగా పోయి బాణం తీస్తుండగా పక్కనున్న కొండపై నుండి పెద్ద బండ రాయి ఒకటి రాళ్లను పిండి చేస్తూ, చెట్లను విరచుకుంటూ వేగంగా దొర్లుతూ రావడం చూసాడు. అది అట్లా దొర్లుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలను విరిచేస్తూ చివరికి ఒక చిన్న మొక్క దగ్గరకొచ్చి ఆగిపోయంది. సహదేవునికి మర్మం అర్దంకాక తిరిగివచ్చేసాడు.


ఆ నలుగురు పాండుపుత్రులు నారాయణుని వద్దకు వచ్చి తాము చూసిన సంఘటనలను వివరించి వాటియందలి అర్దాన్ని తెలుపవలసిందిగా కోరారు. అపుడు ఆ మహా నుభావుడు తనదైన చిరుదరహాస శైలిలో   " తొలి సందర్బం ఉటంకిస్తూ,  కలియుగం నందు చాలా మంది వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పటికీ వ్యర్థపరమైన ఖర్చులు పెడుతుంటారు తప్ప తమ మద్యనే ఉంటూ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తోటి మానవులకు పైసా కూడా ఇవ్వరు. వీరు దనంతో సుఖాలను అనుభవిస్తున్నామను కుంటుంటారు. కానీ శవాలతో సహవాసం చేస్తుంటారు. ఇదే భీముడు చూసిన దాంట్లోఅంతరార్దం"


"ఇక రెండవది, కలియుగమందు  మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిల కూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవిత మంతా అఙ్జానాంధకారములో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది. ఇదే అర్జునుడు చూసిన సంఘటనలోని అర్దం."


"ఇంకా మూడవది, కలియుగంలో తల్లి-దండ్రులు ఆవు తన దూడ పై చూపించిన అతి ప్రేమవలే, తమ సంతానంపై మితిమీరిన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి ఈ అతి వలనే వారు చెడు త్రోవలో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. వీరివలన సమాజం చైతన్యం కోల్పోతుంది. నకులుడు చూసిన సంఘటనలో అంతరార్దం."


"ఇక చివరిగా కలియుగ మానవులు తమ ప్రవర్తన తీరుతెన్నులు సరిగా లేక, జీవిత పరమార్థం, మానవ జన్మ ఆవశ్యకత తెలుసుకోలేక కొండపైనుండి దొర్లి పడిపోయిన బండ వలే దారీతెన్నూ లేక నానాచిక్కుల్లో చిక్కుకుంటూ అశాంతిని అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో తోటివారినికూడా నానా అవస్థలకు గురిచేస్తుంటారు. అయితే అలా దొర్లుతూ చివరికి భగవంతుని చెంతకు వచ్చేటప్పటికి అశాంతి అంతా పోయి పరమ శాంతిని పొందుతుంటాడు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం"  అని కృష్ణుడు బోదించాడు.

srikrishna with pandavas కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: