“సర్వం ధర్మే ప్రతిష్టతి” – సర్వమూ ధర్మంలో ఇమిడి వుంది. ఈ ధర్మమే సకలానికీ ఆధారం. ఈ కారణమ్ వల్లనే “ధర్మో రక్షతి రక్షిత:” అన్న ప్రమాణం ఏర్పడింది. ఐతే కలియుగంలో వేదోపనిషత్తు లను బోధించే వారే ఎక్కువై,ఆచరించేవాళ్ళు తక్కువైనారు. వైదిక ధర్మాచరణాలలో బహుముఖ్యమైన యాగ-యజ్ఞాదులలో సంభవించే రసాయనిక క్రియాల స్వరూపాన్ని ఇప్పుడు విమర్శించుకుందాం. పూర్వం అగ్నిహోత్రం, హోమం, హవనం,సవనం, యజ్ఞం యొక్క నిర్వహణ దినసరి కార్యక్రమమంగా ఉండేది.
Image result for ధర్మో రక్షతి రక్షిత
శాస్త్రాల ఆధారాల మేరకు జ్ఞాన, భక్తి, దేవుని ప్రసాదపు స్వీకరణ, తద్వారా మోక్షమని మెట్టు మెట్టుగా ఫలాలను ఒప్పి, వాటి ప్రాప్తి కోసం ఈ కార్యక్రమాలను ఆచరించే వారుఈ యజ్ఞయాగాదులలో భస్మమయ్యే సేంద్రియ వస్తువుల ద్వారా ఉత్పత్తి అయ్యే క్రిమినాశక పదార్థాలు, రోగకారకమైన అణువుల్ని నాశనం చేసి వాతవరణాన్ని కలుషితం కాకుండా చూసేవి. ఈ నిర్మల వాతావరణంలో ప్రజలు ఆరోగ్యవంతులై మరియు ధృడకాయులై ఉండేందుకు ఎంతో
అవకాశముండేది. కేవల ధార్మికాచరణంగా పిలువబడే ఈ యజ్ఞ నిర్వహణప్రతినిత్యం నడిచేది. ఈ యజ్ఞయాగాదు లలో కేవలం సేంద్రియ (organic) పదార్థాలవాడకమే ఉండేది.
Image result for యజ్ఞాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల వివరాలు:
ఐతే ఆనాడు ఈ కార్యక్రమాలలో మిళితమైన వైజ్ఞానిక (సైంటిఫిక్) కారణాల ను ప్రజలు ఎక్కువగా పట్టించుకోలేదు. అందువల్ల వీటిని సైంటిఫిక్ ఈవెంట్స్ గా వాళ్ళు ప్రచారం చేయలేదు. రాను రానూ ఆధ్యాత్మికత తగ్గి వైజ్ఞానికత పెరగడంతో కొత్తకొత్త రసాయనాలను కనిపెట్టడం జరిగింది. ఈ రసాయనాల మిశ్రణ వల్ల క్రిమిసంహారక మందులను తయారుచేయడం కూడా జరిగింది. ఈ మందులను ఇళ్ళల్లోనూ, చుట్టూ ఉండే ప్రదేశాల్లోనూ విరివిగా వాడడం జరిగింది. ఒకవైపుయజ్ఞయాగా లను మూఢనమ్మకాలుగా పరిగణించి, వాటి నిర్వహణ ను మానివేయడం జరిగింది. కృత్రిమ క్రిమినాశకాల (pestosides) వల్ల వాతావరణ కాలుష్యం హెచ్చింది. స్వచ్ఛమైన వాతావరణంనశించసాగింది.

Image result for యజ్ఞయాగాదులలో నెయ్యి

యజ్ఞయాగాదులలో నెయ్యి, పాలు, పిండి, అన్నం, చక్కెర, పళ్ళు, టెంకాయ, కొబ్బరి మొదలైన వాటిని విరివిగా వాడేవారు. ఆధునికత పెరిగిన తరువాత ఈ పదార్థాల వాడకాన్ని వ్యర్థ కార్యంగా భావించడం మొదలైంది. ప్రజలకు ఉపయోగపడే ఈ పదార్థాలను కాల్చి బూడిద చేసే ప్రక్రియగా యాగాలను నిరసించడం జరిగింది. ఐతే ఈ భావనలు సరికావని ఇటీవలి ప్రయోగాలునిరూపిస్తున్నాయి. కృత్రిమ రసాయన పదార్థాల వల్ల జరిగే కాలుష్యపు నివారణకు సేంద్రియ పదార్థా లను భస్మం చేసే యాగాలే విరుగుడని తేలింది.

Image result for యజ్ఞాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల వివరాలు:

యజ్ఞాలలో ఉత్పత్తి అయ్యే వస్తువుల వివరాలు:

హోమ-యజ్ఞాలలో భస్మమయ్యే పదార్థాలు, క్రమంగా, కట్టెలు (అశ్వత్థ, వేప,మత్తి, శ్రీగంధం, దేవదారు, మామిడి, పనస, చింత, అర్జున, శమీ, బదరి, అర్క
మరియు అనేక మూలికలు, వేర్లు), ఆవు పేడ, నెయ్యి, వెన్న, పాలు,అనేక ధాన్యాలు, కొబ్బరి, పిండి, అన్నం (చరు), బెల్లం,చెరకు,సుగంధద్రవ్యాలు,
అపురూపమైన మూలికలు. సరిగ్గ గమనిస్తే ఇవన్నీసేంద్రియ పదార్థాలే. వీటన్నింటినీ చేర్చి దహన క్రియను నడపడం వల్ల రసాయనిక చర్యలు జరిగి
అనేకమైన క్రిమినాశక వస్తువులు, వాయువులు, ఆవిరి ఉత్పత్తి అవుతాయి. ఈ క్రియల్లో “ఫార్మాల్డిహైడ్” (HCHO), “ఎనిటాల్డిహైడ్” (CH3CHO), “అసిటిక్ఆసిడ్”(CH3COOH)”ఆలాల్డిహైడ్” (CH3OH), “అసిటోన్” (CH3COCH3), ః“ఫీనోల్” (C6H5OH) అనేక ఇతర హైడ్రోకార్బనులు విడుదలవుతాయి. ఇవన్నీ ఏదో ఒక క్రిమినాశక తత్వాన్ని కలిగినవే.

Image result for యజ్ఞయాగాదులలో నెయ్యి

“ఎసిటాల్డిహైడ్”,”ఫార్మాల్డిహైడ్” మొదలైనవి తీవ్రంగా ఆవిరయ్యే ద్రవపదార్థాలు. వీటి బాష్పీభవన స్థాయి 200 మరియు 400 సెంటీగ్రేడ్. వీటికి ఊపిరిని ఆపివేసేంత వాసన ఉండడంతో క్రిమి కీటకాలు వీటి ఆవిరిలో బ్రతకలేవు. ఐతే ఈ అవిరుల సాంద్రత తక్కువున్నప్పుడు వీటికి సువాసన ఉంటుంది. ఇది మనిషి దేహానికి ఉపయోగకరమైంది.


“ఆల్కహాల్” (CH3OH), “బెంజీన్” (C6H6), “ఈథర్” [(CH3CH2)2O] మొదలైనవి ద్రవాల్లో కరిగేవి. అందువల్ల వీటితో తయారైన ద్రావణాలను క్రిమినాశకాలుగా
ఇప్పటికీ వాడుతున్నారు. “ఫార్మిక్ ఆసిడ్” రంగులేని ద్రవ పదార్థం. ఇది ఘాటు వాసన తో కూడినది. “అసిటిక్ ఆసిడ్” చర్మాన్ని కాల్చివేసే సామర్థ్యం
కలిగినది. దీనికి కూడా విశేషమైన వాసన ఉంది. ఇది నీటి ఆవిరితో కలిసినపుడు “కార్బోలిక్ ఆసిడ్”గా మారుతుంది. ఇది మనిషి చర్మంలోని క్రిములను, చెమట వాసనను నాశనం చేస్తుంది. దీనిని సబ్బుల తయారీలో వాడుతారు.


జీవాణువుల్ని నాశనం చేసే “నాఫ్తలిన్” (C10H8) ఘాటు వాసన కలిగి వేడి చేసిన మరుక్షణమే ఆవిరిగా మారి వాతావరణంలోని రోగకారక అణువుల్ని నాశనం చేస్తుంది. దీనికి “నాఫ్తలిన్ బోల్జ్” అని ఇంకొక పేరు ఉంది. ఈ పదార్థాన్ని క్రిముల నుండి దుస్తుల్ని కాపాడడానికి వాడతారు. హోమ యజ్ఞాలలో అగ్ని ఎక్కువ కాలం మండడానికి కొన్ని రసభరిత మైన సమిధలని వాడడం వల్ల జిగురు పదార్థంతో కూడిన “టర్పంటైన్” ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా క్రిమి
సంహారిణే. హోమంలో వాడే నెయ్యి, పాలు, జిడ్డుతో కూడిన ఇతర పదార్థాలను భస్మం చేయడంవల్ల కట్టెలలోని “సెల్యులోస్” (C6H10O5) మరియు”ఆగ్నోసెల్యులోస్”[(C6H10O5)x]లను సంపూర్ణం గా దహించేందుకు వీలౌతుంది.

Image result for నెయ్యి

నెయ్యి లాంటి జిడ్డు పదార్థా లలో “అసిటిక్ ఆసిడ్” మరియు “గ్లిసరాల్” (CH2OHCHOHCH2OH) ఉంటాయి. ఇవి కట్టెలను దహించే క్రియలో కొన్ని రకాల
ఆమలాలను విడుదల చేస్తాయి.”గ్లిసరాల్” దహనంతో “ఎక్రోలిన్” (ఆల్డిహైడ్) పుడుతుంది. అలాగే అనేక రకాల “ఎస్టర్లు” కూడా వాతావరణాన్ని చేరుతాయి.
వీటన్నిటినీ వేసి హోమం చేసిన చాలా సమయం వరకు కూడ సువాసనను వెదజల్లుతూనే ఉంటాయి. ఐతే ఈ “ఎస్టర్లు” స్త్రీల గర్భకోశానికి హాని కలిగిస్తాయి. ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు కనుక, పూర్వీకుల యజ్ఞాల పూర్ణాహుతి సమయంలో గర్భిణీ స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారు. ఇలా యజ్ఞాల నుండి ఉత్పన్నమైన రసాయన పదార్థాలు కేవలం క్రిమి, కీటకాలను మాత్రమే నాశనం చేస్తాయని అనుకోరాదు. ఇవి దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేయగలవు.

ఇది ఏ మాత్రం హస్యాస్పదమైన విషయం కాదు. యజ్ఞకుండం నుండి వెలువడే ఆవిరులు, పొగల ద్వారా సూక్షమైన రసాయన పదార్థపు అణువులు, భస్మం మనిషి దేహాన్ని చేరి దీర్ఘకాలంగా బాధిస్తున్న కంటి వ్యాదుల్ని, తలనొప్పుల్ని, పార్శవపు నొప్పుల్ని, అనేక చర్మ రోగాల్ని, మూర్చ రోగాలను, ఉదర సంబంధ రోగాలను నయంచేస్తాయి. ఇప్పటికీ ఆయుర్వేద వైద్య పద్ధతిలో భస్మాలను వాడే పద్ధతి ఉంది. ఈ భస్మాలను హోమ, యజ్ఞాదుల నుండే గ్రహించడం జరుగుతుంది.
Image result for ట్యూబర్ క్యులోసిస్
అస్తిగత రోగమైన ట్యూబర్ క్యులోసిస్ మరియు నేత్ర రోగాలకు “అమృతవేరు” ను దహించి చేసిన హోమపు భస్మం చాలా మంచిది. నాగకేసరి,లవంగ,యాలకులు, మిరియాలు, అశ్వగంధ, దేవదారు, వేప మొదలైన వాటిని మంత్రపూరితంగా హోమంలో వేసి, ఆ భస్మాన్ని రోజూ సేవిస్తే దీర్ఘకాల జ్వరం, పాండురోగం, అజీర్ణం,కామెర్లు, కుష్టు,శ్వాసకోశ వ్యాధులు, ఉదరవ్యాధులు, వాత సంబంధి రోగాలు పూర్తిగా నయమౌతాయి.

Image result for మసాలా

ఇవే కాకుండా అనేక వాతావరణ పరిరక్షకాలైన రసాయనాల విడుదలకు కూడా ఈ యజ్ఞాలు దోహద పడతాయి. పూర్వకాలంలో యజ్ఞాలు రోజుల తరబడి సాగేవి. యజ్ఞం జరిగినన్ని నాళ్ళూ యాజ్ఞీకులు కేవలం పాలు మాత్రమే తీసుకుని, ఉచ్ఛకంఠంతో రోజంతా మంత్ర పఠనం చేసి, వేసిన ఆసనం నుండి బహుకాలంకదలకుండా కూర్చునేవారు. ఈ దేహ ధారుఢ్యానికి యజ్ఞాలనుండి విడుదలయ్యే పదార్థాలే కారణం. అందువల్ల పదార్థాల ను వ్యర్థంగా కాల్చే ప్రక్రియగా యజ్ఞాలను పరిగణించడం తప్పు.


మరింత సమాచారం తెలుసుకోండి: