టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మల ప్రేమాయణం గురించి తెలిసిందే. కొన్నాళ్లదాకా తమ మధ్య అనుబంధాన్ని బహిర్గతం చేయని ఈ జోడీ ఇటీవలే తాము ప్రేమలో మునిగితేలుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వెల్లడించింది. తాజాగా, కోహ్లీ, అనుష్క గోవా ఎయిర్ పోర్టులో కనిపించి, అభిమానులకు కనువిందు చేశారు. దక్షిణాఫ్రికాతో ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా దొరికిన విరామాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కతో కలిసి గోవాలో వాలిపోయాడు.

గోవా టూర్‌కి తర్వాత ఈ జంట సోమవారం ముంబై చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ జంట మీడియా కంటికి చిక్కింది. శిఖర్‌ ధవన్‌-ఆయేషా దంపతులు కూడా ఈ ప్రేమ జంటకు తోడైనట్టు సమాచారం. ఈ ట్రిప్‌ అనంతరం ప్రేమపక్షులు కోహ్లీ-అనుష్క ముంబైకి చేరుకున్నారు. ఇక్కడి ఎయిర్‌ పోర్టులో వీరిద్దరూ సరదాగా కనిపించారు.

వీరిని కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నిస్తుంటే కోహ్లీ నవ్వుతూ బ్యాగ్‌ను ముఖానికి అడ్డు పెట్టుకున్న ఫొటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  కోహ్లీ-అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. వీరిద్దరూ అనుష్క తండ్రితో కనిపించడంతో వాటికి మరింత బలం చేకూరింది. అయితే వీటిని అనుష్క కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: