ఈ మద్య టీమిండియాకు బాగా కలిసి వస్తుంది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ లో నాలుగు మ్యాచ్ లు చిత్తుగా ఓడినా ఐదో వన్డే మాత్రం పట్టుదలతో ఆడి నెగ్గారు..ఇక టీ 20 మ్యాచ్ లో మూడు మ్యాచ్ లు దిగ్విజయంగా ముగించి సిరీస్ సొంతం చేసుకున్నారు. తాజాగా భారత జట్టు అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లోకి ప్రవేశించింది. భారత జట్టు అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లోకి ప్రవేశించింది.

ఈ రోజు శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్స్ లో భారత జట్టు శ్రీలంకపై 97 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 267 పరుగులు చేసింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 170 పరుగులకే కుప్పకూలింది.  మొత్తానికి మన భారత ఆటగాళ్లు ప్రత్యర్థుల తాట తీస్తూ భారత్ పరువు నిలుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: