క్రికెట్ ప్రపంచంలో కొందరు ఆటగాళ్ల పేర్లు మాత్రమే మారుమోగుతుంటాయి. ఇక భారత్ లో బెస్ట్ క్రికెటర్ అనగానే గుర్తుకు వచ్చేది సచిన్ టెండుల్కర్..ప్రస్తుతం ఆ స్థానం భర్తీ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇక వెస్ట్ ఇండీస్ బ్యాట్ మెన్స్ లో నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా పేరు గాంచిని క్రిస్ గేల్ తండ్రయ్యాడు. క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టాడంటే  బౌలర్లపై సిక్సర్లతో విరుచుపడే గేల్ అంటే అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా  గేల్ భార్య నటాషా బెర్రిడ్జ్  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ వార్త వినగానే గేల్ పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. వెంటనే గేల్ విండీస్ కు పయనమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్.. ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన వెంటనే డైరెక్ట్ గా ఎయిర్ పర్ట్ కు వెళ్లి విండీస్ ఫ్లైట్ ఎక్కేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ కి కూడా గేల్ దూరం కానున్నాడు.

 క్రిస్ గేల్


ఇక వారం రోజుల తర్వాత గేల్ బెంగళూర్ జట్టుతో చేరే అవకాశముంది.ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఐపీఎల్ ఇప్పుడిలా తండ్రవడంతో గేల్ ఖుషీగా ఉన్నాడు. గేల్ కి మగబిడ్ట పుట్టడంతో తోటి క్రీడాకారులు అభినందనలతో ముంచెత్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: