రియో ఒలంపిక్స్ లో మహిళా బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజిత పతాకం కైవసం చేసుకున్న పివి సింధును త్వరలో గుజరాత్ కు ఆహ్వానించి ప్రభుత్వం తరపున ఘనంగ సత్కరిస్తామని గుజరాత్ సిఎం విజయ్ రూపాని అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గుజరాత్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కూమరుని పెళ్లికి అతిధిగా వచ్చిన విజయ్ రూపాని హైదరాబాద్ శంషా బాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు.   


బిజెపి సిఎం అయిన విజయ్ రూపాని ప్రజలు మోది పాలన మీద నమ్మకంతో ఉన్నారని అన్నారు. ఇక పివి సింధు సాధించిన విజయం గురించి ప్రస్థావించిన విజయ్ రూపాని ఆమెను తమ రాష్టానికి పిలిచి తప్పకుండా సత్కరిస్తామని అన్నారు.  సింధు రజిత పతాకంతో పాటుగా దేశ ప్రజల మనసుని గెలుచుకుంది. ఇక తెలంగాణా, ఏపి రాష్ట్రాల్లో సిందుకు ఘన సత్కారం పాటుగా ఆమెకు ఎన్నో వరాలు కురిపించాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.   



మరింత సమాచారం తెలుసుకోండి: