ఒలంపిక్స్ లో రజిత పతాకంతో వచ్చిన పివి సింధుకు తెలుగు రెండు రాష్ట్రాలు ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. ఇక సిల్వర్ మెడల్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న సింధు నేటి యువతకు మంచి మార్గదర్శకురాలు. అందుకే ఆమె చేత వాణిజ్య ప్రకటనలు చేయించాలని పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. 


ఇప్పటికే సింధు ఒలంపిక్స్ కు వెళ్లడానికి ముందే కొన్ని కంపెనీలకు సైన్ చేసిందట. ఇక ప్రస్తుతం తనకున్న డిమాండ్ ప్రకారం ఒక్కో ప్రకటనకు 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందట సింధు. ఇక ముందు కమిట్ అయిన కంపెనీలకు మాత్రం అనుకున్న ప్రైజ్ లోనే చేస్తుందట. ఇక ఆమె బ్రాండ్ వ్యవహారాలను చూసే ఆర్ రామకృష్ణన్ సెప్టెంబర్ రెండో వారం నుండి ఆమె తొలి కాంట్రాక్ట్ చేస్తుందని అన్నారు.


ఒలంపిక్స్ కు ముందు కూడా సింధు చేయాల్సిన కొన్ని ప్రకటనలు ఆ టైంలో ప్రాక్టీస్ కు ఇబ్బందిగా ఉంటుందని పోస్ట్ పోన్ చేశారట. ఇప్పుడు వాటికి మరింత డిమాండ్ తో ప్రమోట్ చేసే అవకాశం ఉంది. సో ఈ లెక్కన సింధు యాడ్స్ రూపంలో కూడా మంచి ఆదాయాన్ని పొందుతుందని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: