క్రికెట్ ప్రేమికులకు ఈడెన్ గార్డెన్ యొక్క ప్రాముఖ్యత బాగా తెలుసు.. అక్కడ ఎన్నో మ్యాచ్ లు భారత్ విజయ బావుటా ఎగురవేసింది. క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన ఈడెన్ గార్డెన్ లో ఒక స్టాండ్ పేరు సౌరబ్ గంగూలి పేరు పెట్టాలని బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ ఓ ప్రతిపాదన తీసుకు రావడం జరిగింది. స్టేడియంలోని ఏడు స్టాండ్లకు ఏడుగురు ప్రముఖుల పేర్లు పెట్టాలని వారు నిర్ణయించారు.


ఇక పరిశీలణలో ఉన్న వ్యక్తుల పేర్లు ఇలా ఉన్నాయి.. జగ్ మోహన్ దాల్మియా, మాజీ ప్లేయర్ పంకజ్ రాయ్, బెంగాల్ క్రికెట్ మాజి ప్రెసిడెంట్ బి.ఎన్ దత్, ఏ.ఎన్ ఘోష్, ఆచార్య స్నేహాన్షు, సిద్ధార్థ్ రాయ్ ల పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే కేవలం ఇవి పరిణీలణకు మాత్రమే ఉన్నాయని ఎవరిది కన్ఫాం చేయలేదని అన్నారు.   


ఇక ఈడెన్ గార్డెన్ లో టికెట్ల రేట్లు కూడా తగ్గించాలని నిర్ణయించారట. ప్రస్తుతం మార్చిన రేట్ల ప్రకారం 1000, 750, 500 లుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 30 నుండి ఈడెన్ గార్డెన్ లో భారత్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: