ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్ డేలో లక్ష్యాన్ని చేధించిన టీం ఇండియా జట్టులో జాదవ్ ఆటతీరుని చూసి హర్షం వ్యక్తం చేసింది. దూకుడు తనంతో జాదవ్ ఆడిన తీరు చూస్తే విరాట్ కొహ్లి కన్నా తానే మెరుగైన బ్యాటింగ్ చేశాడనిపించిందని తన అభిప్రాయం వ్యక్తపరిచారు సౌరబ్ గంగూలి. అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అనుభవం తక్కువే అయినా జాదవ్ ఆడిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది.


ఇక సొంత గడ్డపై మొదటి మ్యాచ్ లోనే సెంచరీతో అలరించిన జాదవ్ ఎప్పుడు తన ఇన్నింగ్స్ టీం ఇండియాకు విజయాన్ని అందించేలా ఉండాలని అభిప్రాయపడ్డాడు. తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ కొట్టడం ఆనదంతో ఉన్న జాదవ్ కొహ్లితో ఎన్నోసార్లు భాగస్వామిగా ఉండే అవకాశం మిస్ చేసుకున్నానని.. కాని ఆ అవకాశం కూడా ఈ మ్యాచ్ తో దొరికిందని తెలిపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: