బంగ్లాదేష్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా హయ్యెస్ట్ స్కోర్ సాధించింది. మొదటి ఇన్నింగ్స్ కే 687 పరుగుల అత్యధిక స్కోర్ సాధించింది టీం ఇండియా. జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లి మరోసారి విజృభించాడు. 204 పరుగులను చేసిన విరాట్ టెస్ట్ క్రికెట్ లో మరో డబుల్ సెంచరీని బాదాడు.


రెండో రోజు మ్యాచ్ మొత్తం ఇండియా చేతిలోనే ఉందని చెప్పొచ్చు. సెంచరీతో విరాట్, హాఫ్ సెంచరీకి చేరువలో రహనే మ్యాచ్ స్టార్ట్ చేయగా.. త్వరగా పరుగుల వరద సృష్టించి జట్టు స్కోర్ ను 687 చేశారు. కొహ్లి డబుల్ సెంచరీతో పాటు మురళి విజయ్, సాహా కూడా సెంచరీ కొట్టారు. పూజారా, రహనే లు కూడా హాఫ్ సెంచరీఎతో అలరించారు. ఇక 687 వద్ద డిక్లేర్ చేసిన టీం ఇండియా రెండో రోజు మ్యాచ్ ముగిసే సరికి బంగ్లాదేష్ 14 ఓవర్లు ఆడి 41 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోవడం జరిగింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: